Wednesday, 7 September 2016

24 గంటల్లోగా వెబ్‌సైట్లోకి.. ఎఫ్‌ఐఆర్‌లు- SC


దిల్లీ: కేసు నమోదు చేసిన 24 గంటల్లోగా సదరు ఎఫ్‌ఐఆర్‌లను ఆయా వెబ్‌సైట్లలో అప్‌లోడ్‌ చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పోలీస్‌ శాఖలను సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.
ఎఫ్‌ఐఆర్‌ను 24 గంటల్లోగా వెబ్‌సైట్లో అప్‌లోడ్‌ చేయాలంటూ ఇటీవల దిల్లీ హైకోర్టు నగర పోలీసులను ఆదేశించింది. దీంతో హైకోర్టు తీర్పును ప్రస్తావిస్తూ.. భారత యువ లాయర్ల అసోసియేషన్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై విచారించిన న్యాయస్థానం..

దిల్లీ హైకోర్టు ఆదేశాలను అంగీకరిస్తూనే, కొన్ని మార్పులు చేసింది.

అన్ని రాష్ట్రాల పోలీస్‌ అధికారులు 24 గంటల్లోగా ఎఫ్‌ఐఆర్‌ను వెబ్‌సైట్లో అప్‌లోడ్‌ చేయాలని ఆదేశించింది. తొలుత 48 గంటల సమయం ఇవ్వాలని భావించినప్పటికీ.. 24 గంటల పరిమితినిస్తూ తీర్పు చెప్పింది. ఇంటర్నెట్‌ సదుపాయం సరిగా లేని ప్రాంతాల్లో మాత్రం 72 గంటల్లోగా అప్‌లోడ్‌ చేసేందుకు అనుమతినిచ్చింది. కాగా.. మహిళలు, చిన్నారులపై లైంగిక వేధింపుల లాంటి కేసుల్లో ఎఫ్‌ఐఆర్‌ను అప్‌లోడ్‌ చేయడంలో మినహాయింపు కల్పించింది.

కొత్త జిల్లాల ఏర్పాటుకు నిధులు విడుదల

హైదరాబాద్‌: తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఒక్కో జిల్లా ఏర్పాటు ప్రక్రియ కోసం రూ.కోటి చొప్పున విడుదల చేస్తూ ప్రణాళికా శాఖ బుధవారం ఉత్తర్వులు వెలువరించింది. హైదరాబాద్‌ మినహా ప్రతిపాదిత 26 జిల్లాలకు రూ.కోటి చొప్పున విడుదల చేశారు. కొత్త జిల్లాల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రత్యేక నిధినుంచి ఈ నిధులను విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు.

రైతులకు మెరుగైన సేవలు అందిస్తాం : మంత్రి హరీష్ రావు


రైతులకు మరింత మెరుగైన సేవలు అందిస్తాం
జాతీయ వ్యవసాయ మార్కెట్-నామ్ వర్క్ షాప్ బంజారాహిల్స్ లోని అడ్మినిస్ట్రేటివ్ స్టాప్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో ప్రారంభమైంది. నామ్ వర్క్ షాప్ ను మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ వర్క్ షాప్ కు పది జిల్లాల మార్కెటింగ్ శాఖ అధికారులు హాజరయ్యారు. రైతులకు మెరుగైన సేవలందించడానికి మార్కెటింగ్ శాఖ, ఆస్కి ల మధ్య ఒప్పందం కుదిరింది. 44 వ్యవసాయ మార్కెట్లలో నామ్ అమలు కానుంది. దీని ద్వారా దేశంలోని ఏ వ్యాపారైనా ఆన్ లైన్ లో రైతుల వద్దనుంచి పంటను కొనే అవకాశం లభించనుంది. ఫలితంగా రైతుకు మద్దతుధర దొరకనుంది.
రైతులకు మరింత మెరుగైన సేవలు అందించడమే మార్కెటింగ్ శాఖ లక్ష్యమని మంత్రి హరీష్ రావు అన్నారు. రైతు బజార్లను మరింత పటిష్టం చేస్తామన్నారు. ప్రతి రెవెన్యూ డివిజన్, నియోజకవర్గ కేంద్రంలో రైతు బజార్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. కూరగాయాలు, పండ్లు నిల్వ చేసేందుకు కోల్డ్ స్టోరేజ్ లు ఏర్పాటు చేస్తామన్నారు.
నాణ్యమైన పంటలతో రైతులకు రెట్టింపు ఆదాయం వస్తుందని హరీష్ రావు అన్నారు. మార్కెటింగ్ శాఖ లో సాంకేతికతను ఉపయోగించి సేవలను విస్తరించేందుకు కృషిచేయాలన్నారు. పెసర్ల అంశంపై కేంద్రంతో చర్చించామని, కేంద్ర ప్రభుత్వ సంస్థలు మద్దతు ధర చెల్లించి కొనడానికి ముందుకు వస్తున్నాయని చెప్పారు. తొందరపడి రైతులు పెసర్లను వ్యాపారులకు అమ్మొద్దని మంత్రి సూచించారు. రెండుమూడు రోజుల్లోనే కేంద్రం పెసర్లను కొంటుందని తెలిపారు.
రెండు రోజుల పాటు జరుగనున్న వర్క్ షాప్ లో నామ్ పై మార్కెటింగ్ శాఖ అధికారులకు శిక్షణ ఇవ్వనున్నారు.

ఆసియాలోనే అతిపెద్ద స్టార్టప్ సదస్సు 'ఆగస్ట్ ఫెస్ట్


అద్భుత ఆవిష్కరణల కేంద్రంగా తెలంగాణ
- రాష్ట్రంలో పరిశోధనలకు ప్రాధాన్యం..
- 'ఆగస్ట్ ఫెస్ట్'లో మంత్రి కేటీఆర్

తెలంగాణను స్టార్టప్‌ల రాష్ట్రంగానే కాకుండా అద్భుత ఆవిష్కరణల కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు చెప్పారు. నగరంలోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో ఆసియాలోనే అతిపెద్ద స్టార్టప్ సదస్సు 'ఆగస్ట్ ఫెస్ట్'ను మంత్రి శనివారం ప్రారంభించారు. రెండు రోజుల ఈ సదస్సులో కేటీఆర్ మాట్లాడుతూ.

'నగరంలో త్వరలో రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ (రిచ్) పేరిట ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. తద్వారా రాజధానిలోని పరిశోధన సంస్థలు నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించే అవకాశం ఉంటుంది.
దేశంలోని ప్రముఖ పరిశోధన సంస్థల్లో దాదాపు 30 ఇక్కడే ఉన్నాయి. వీటి సహకారంతో రిచ్‌ను ఏర్పాటు చేస్తాం. సీసీఎంబీ, ఐఐసీటీ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు మార్కెట్ అవసరాలకు అనుగుణంగా పరిశోధనలు జరపాలి. నూతన ఆవిష్కరణల ద్వారా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు పెట్టుబడిదారులు కూడా వస్తారు. 

టీ హబ్ కేవలం స్టార్టప్‌లకే పరిమితం కాకుండా ఇతర ఇంక్యుబేటర్లు, స్టార్టప్‌లకు ఊతమిస్తోంది. రూరల్ టెక్నాలజీ పాలసీలో భాగంగా రూరల్ ఇంక్యుబేటర్లను ప్రోత్సాహిస్తాం. వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ వంటి ప్రాంతాల్లో స్టార్టప్‌ల కోసం ఏర్పాట్లు చేస్తున్నాం. వాట్సప్ సంస్థను 19 బిలియన్ డాలర్లకు అమ్మారు. అది అమెరికాలో ఉండడంవల్లే అంత ప్రాధాన్యతతో భారీగా డబ్బులు రాగలిగాయి. అంతటి విలువ రావాలంటే సరైన సమయం, ప్రాంతంలో, అవసరమైన సంస్థలను నెలకొల్పాల్సిన అవసరం ఉంది' అన్నారు.
నవంబర్ 5న టీ ఫండ్.
వెంచర్ క్యాపిటలిస్టులను రాష్ట్రానికి ఆకర్షించడంతో పాటు స్టార్టప్‌లను ప్రోత్సహించే లక్ష్యంతో నవంబర్ 5న 'టీ ఫండ్'ను ప్రారంభిస్తున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. టీ ఫండ్‌లో రాష్ట్ర ప్రభుత్వం కూడా గణనీయమైన మొత్తాన్ని పెట్టుబడిగా పెడుతుందన్నారు. 'భారతీయ, తెలంగాణ స్టార్టప్‌లను ప్రపంచ స్థాయి మార్కెట్లు, వెంచర్ క్యాపిటలిస్టులకు దగ్గర చేసే ప్రయత్నాల్లో భాగంగా అక్టోబర్‌లో అమెరికా సిలికాన్ వ్యాలీలో టీ హబ్ ఔట్‌పోస్టును ప్రారంభించనున్నాం. స్టార్టప్‌ల ప్రోత్సాహానికి అనువైన వాతావరణం, మద్దతు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా పేరొందిన వాణిజ్య సంస్థలు తమ ఉత్పత్తుల నాణ్యత పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. అందుకు అవసరమైన మానవ వనరులు రాష్ట్రంలో ఉన్నాయి. వచ్చే ఆగస్టు ఫెస్ట్ నాటికి వెంచర్ క్యాపిటలిస్టులు మరింత మందిని ఆహ్వానిస్తాం' అని కేటీఆర్ చెప్పారు. సమావేశంలో ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్‌రంజన్, ఆగస్ట్ ఫెస్ట్ నిర్వాహకుడు కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
టీమ్ వర్క్ తోనే విజయం.
1998లో ఆన్‌లైన్‌లో ఈ కామర్స్‌ను పనిచేయడం ప్రారంభించామని, మొదటి ఏడాది రోజుకు 50 ఆర్డర్లే వచ్చేవని, ప్రస్తుతం 2.5 మిలియన్ ఆర్టర్లు వస్తున్నాయని మార్ట్‌జాక్ సంస్థ సీఈఓ అభయ్ దేశ్‌పాండే చెప్పారు. సంస్థలో ఉద్యోగులు, అధికారులు ఒక జట్టుగా పనిచేయడంవల్లే ఇది సాధ్యమైందన్నారు. ప్రారంభ దశలో ఎన్నో ఇబ్బందులు పడ్డామని, తరువాత నేరుగా ప్రయాణికులతో అనుసంధానం చేసుకోవడంవల్ల పదేళ్ల కాలంలో దేశంలో అతిపెద్ద టికెట్ అమ్మకాల సంస్థగా మారిందని రెడ్‌బస్ వ్యవస్థాపకుడు ఫణీంద్ర సామ తెలిపారు. ఫెస్ట్‌లో వందకు పైగా స్టార్టప్ సంస్థల ఉత్పత్తులు ఆకట్టుకున్నాయి.

యాదాద్రి టెంపుల్ సిటీ లేఅవుట్లు, డిజైన్లను పరిశీలించిన సీఎం



యాదాద్రి దేవస్థానంపై సీఎం కేసీఆర్ సమీక్ష
భక్తుల రద్దీ భారీగా పెరిగే అవకాశం ఉంది
భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు
850 ఎకరాల విస్తీర్ణంలో టెంపుల్ సిటీ
వెళ్లేందుకు, వచ్చేందుకు రహదారులు నిర్మించాలి
గుట్టను ప్రకృతి రమణీయంగా తీర్చిదిద్దాలి
హైదరాబాద్ : నల్లగొండ జిల్లాలోని యాదాద్రి దేవస్థానం అభివృద్ధి పనులపై సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశానికి మంత్రి జగదీష్‌రెడ్డి, ఎంపీ బూర నర్సయ్యగౌడ్, వైటీడీఏ స్పెషల్ ఆఫీసర్ కిషన్‌రావుతో పాటు పలువురు అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా టెంపుల్ సిటీ లేఅవుట్లు, డిజైన్లను సీఎం పరిశీలించారు.
అనంతరం సీఎం మాట్లాడుతూ.. 'యాదాద్రిని అద్భుత పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతున్నందున రానున్న కాలంలో భక్తుల రద్దీ భారీగా పెరిగే అవకాశం ఉంది. భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలి. 850 ఎకరాల విస్తీర్ణంలో దేవాలయ నగరం ఏర్పాటు చేయాలి. కాటేజీలు, విశాలమైన రోడ్లు, పార్కింగ్, ఉద్యానవనాలు, పుట్‌పాత్‌లు, ఫుడ్‌కోర్టులు, ఇన్ఫర్మేషన్ కోర్టులు ఏర్పాటు చేయాలి. మొదటి దశలో 250 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టాల్సిన పనుల నమూనాలను ఖరారు చేశాం.
86 ఎకరాల విస్తీర్ణంలో 200 కాటేజీలు, మూడున్నర ఎకరాల విస్తీర్ణంలో ఫుడ్‌కోర్టులు, 7 ఎకరాల విస్తీర్ణంలో మంచినీరు, మరుగు నీటి నిర్వహణ వ్యవస్థ, 12 ఎకరాల్లో గ్రీనరీ, 62 ఎకరాల్లో రోడ్లు, 26 ఎకరాల్లో ల్యాండ్ స్కేపింగ్, 42 ఎకరాల గుట్ట ప్రాంతాన్ని ప్రకృతి రమణీయంగా తీర్చిదిద్దాలి. యాదాద్రిలో కాటేజీలు నిర్మించడానికి సింగరేణి, జెన్‌కోతో పాటు దేశ వ్యాప్తంగా కార్పొరేట్ కంపెనీలు ముందుకొస్తున్నాయి. కంపెనీలకు కేటాయించిన 1000-1500 గజాల ఓపెన్ ప్లాట్లను సిద్ధం చేయాలి. కాటేజీలు నిర్మించే ప్రాంతంలో రోడ్లు, విద్యుత్, మంచినీటి సౌకర్యం కల్పించాలి.
ప్రధాన ఆలయానికి వెళ్లేందుకు, వచ్చేందుకు రెండు వేర్వేరు రహదారులు నిర్మించాలి. ప్రస్తుతం ఉన్న దారిని గుట్టపైకి వెళ్లేందుకు, గుట్ట కిందకు వచ్చేందుకు కొత్త రహదారిని నిర్మించాలి. భక్తులను గుట్టపైకి తీసుకెళ్లేందుకు ప్రత్యేక రవాణా సదుపాయం కల్పించే యోచనలో ఉన్నాం. నిర్మాణాలు పూర్తయ్యాక నిర్వహణ బాధ్యతలు చూసేందుకు అవసరమైన వ్యూహం ఖరారు చేయాలి. యాదాద్రి పనులను నల్లగొండ జిల్లా ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు సమీక్షించాలి అని సీఎం ఆదేశించారు.

ఒబేసిటీ’ని ఓడిద్దాం



మీరు అధిక బరువు.. అదే ఒబేసిటీ సమస్యతో బాధపడుతున్నారా? ఆందోళన చెందకండి. ఆహారంలో కొద్దిపాటి మార్పులు చేసుకోవడం ద్వారా మీరు మీ శరీర బరువును తగ్గించుకోగలుగుతారు. కేవలం వారం రోజుల వ్యవధిలో మీరు 5 నుంచి 7 కేజీల వరకు బరువు తగ్గుతారు. ఒకవేళ మీరు ఇంకా ఎక్కువ బరువు తగ్గాలనుకుంటే, ఒక వారం రోజులు తర్వాత ఈ డైట్ ను మళ్ళీ మొదలుపెట్టవచ్చు. ఇలా మీరు మొత్తం బరువు తగ్గేవరకు కొనసాగించవచ్చు.
మొదటి రోజు
మీ డైట్ ప్లాన్ లో భాగంగా మొదటిరోజున కేవలం పండ్లు మాత్రమే తినాలి. అన్ని రకాల పండ్లు తినవచ్చు.. ఒక్క అరటిపండు తప్ప. అయితే ఎక్కువగా పుచ్చకాయ ముక్కలు తినడం వలన ఎక్కువ బరువు తగ్గుతారు. వీటితోపాటుగా రోజులో కనీసం 2 నుంచి 3 లీటర్ల మంచినీరు తాగాలి.
రెండో రోజు
ఈ రోజంతా కేవలం కూరగాయలే మీ ఆహారం. అన్ని రకాల కూరగాయలు తినవచ్చు. పచ్చివి తినగలిగితే తినండి, లేదంటే ఉడికించుకుని అయినా తినొచ్చు. అయితే బంగాళదుంప మాత్రం రోజులొ ఒక్కసారి మాత్రమే తినాలి. ఆది కూడా ఉదయం అల్పాహారం తీసుకునే సమయంలో మాత్రమే. 2 చిన్న బంగాళదుంపలు మాత్రమే ఉడకబెట్టుకుని తినాలి. అలాగే రోజులో కనీసం 2 నుంచి 3 లీటర్ల మంచినీరు తాగండి.

మూడో రోజు
ఇక మూడోరోజు మీరు అన్ని రకాల కూరగాయలు, పండ్లు తినవచ్చు. అయితే ఈ రోజంతా బంగాళదుంప మరియు అరటి పండు మాత్రం తినకూడదు. ఇవి తప్ప ఏవైనా తినొచ్చు. వీటితోపాటు 2 నుంచి 3 లీటర్ల మంచినీరు తాగాలి.
నాలుగో రోజు
ఈ రోజు 4 పెద్దవి లేక 6 చిన్న అరటి పండ్లు తినొచ్చు. వాటితొ పాటుగా 500 ml (అర లీటర్) పాలు కూడా తాగాలి. అంతేకాదు, ఈరోజు మొదలుకుని మీరు రోజుకి రెండుసార్లు క్యాబేజీ సూప్ తాగాలి
అయిదో రోజు

మీరు కనక శాకాహారులైతే.. ఈరోజు బ్రౌన్ రైస్ మరియు 6 టొమాటోలు తినవలసి ఉంటుంది. ఒకవేళ మీకు బ్రౌన్ రైస్ దొరక్కపోతే, దానిబదులు పనీర్ తినొచ్చు. ఇక రోజు మధ్యలో ఆకలి వేసినపుడు క్యాబేజీ సూప్ తాగాలి. ఒకవేళ మీరు మాంసాహారులయితే అర కేజి బోన్ లెస్ చికెన్ లేదా మేక మాంసం లేదా చేపను తినాలి. దీంతోపాటు 6 టొమాటోలు తినాలి. అంతగా ఆకలి వేస్తే క్యాబేజీ సూప్ ఉండనే ఉందిగా.. ఈ సూప్ ఎంతైనా తాగొచ్చు.
ఆరో రోజు 

ఆరో రోజున శాకాహారులు బ్రౌన్ రైస్ మరియు కూరగాయలు తినొచ్చు. టొమాటోలుగాని బంగాళదుంపగాని తినకూడదు. ఆకలి వేసినప్పుడు క్యాబేజీ సూప్ తాగుతూ ఉండాలి. మాంసాహారులయితే.. అర కేజి బోన్ లెస్ చికెన్ లేదా మేక మాంసం లేదా చేపను తినాలి. కుదిరితే చికెన్ సూప్ చేసుకుని తాగొచ్చు. కూరగాయలుతో చేసిన సలాడ్ మాత్రం తప్పనిసరిగా తినాలి. మరీ ఆకలి వేస్తే క్యాబేజీ సూప్ తాగొచ్చు.
ఏడో రోజు
ఈరోజు మీరు బ్రౌన్ రైస్ తప్పనిసరిగా తినాల్సి ఉంటుంది. మొలకెత్తిన పెసలు మరియు నచ్చిన కూరగాయలు బ్రౌన్ రైస్ లో వేసుకుని వెజ్ బిర్యానీలా చేసుకుని తినాలి. దీంతోపాటు మీకు ఇష్టమైన పండ్ల రసాలు తాగండి. ఆకలి వేసినపుడు క్యాబేజీ సూప్ తాగాలి.
ఇవి గుర్తుంచుకోండి..
ఈ వారం రోజులు రోజుకి కనీసం 2 నుంచి 3 లీటర్ల మంచినీరు తాగాలి. మద్యపానం జోలికి పోకూడదు. అలాగే చిరుతిండ్లు మరియు నూనె అధికంగా ఉన్న ఆహార పదార్థాలు తినకూడదు. కుదిరితే రోజుకి కనీసం ఒక అరగంట వ్యాయామం చేయాలి. రోజూ క్యాబేజీ సూప్ మాత్రం తప్పకుండా తాగాలి.
మీరు కనుక ఏడు రోజులు క్రమం తప్పకుండా ఈ రకమైన ఆహారం తీసుకుంటే కనీసం 5 నుంచి 7 కేజీల బరువు తగ్గుతారు. ఒకవేళ ఇంకా బరువు తగ్గాలనుకుంటే ఈ డైట్ ను మళ్ళీ మొదలెట్టండి.. 

Paytm Will Invests INR 300 Cr on its Travel Business -PAYTM



Paytm, India’s largest mobile payment and commerce platform, has registered over 1 million flight and bus ticket bookings on its Travel Marketplace in August. The company expects 2x growth in the travel business over the next 6 months.
Paytm’s bus tickets business recently turned break-even. The Hotels category is expected to turn break even very soon and the Flights bookings has been organically scaling at a 4x month-on-month growth since its launch in May. In its drive towards creating the country’s best cashless travel ecosystem, Paytm will soon launch new categories and ancillaries. To fuel this growth, the company will further invest INR 300Cr on its travel business.
Being modeled as a marketplace, Paytm has multiple sellers providing various travel services to customers. This allows the platform to offer a diverse selection at the most competitive prices. Paytm offers a unique opportunity for travel service providers to gain access to its 130 million strong and growing user base.
Abhishek Rajan, Vice President, Paytm, said, “At Paytm, we are building India’s largest travel marketplace with the mission to solve every need of a traveller – be it transport, accommodation, activities or ancillaries. We have seen exponential growth in all categories and will soon offer new services to our customers. Leveraging Paytm’s significant market penetration and strong brand proposition, we hope to grow India’s online travel booking pie by introducing new customers from tier II, III towns and cities to this category.
The company has set up a 100+ member team in its Bengaluru office to drive innovation in the category. This move is an important step in the vision of making cashless transactions a way of life across all consumer segments and demographic profiles in India.