Friday 7 October 2016

ATR in Court against AIMIM Chief


HYDERABAD:Delhi Police on Friday sought more time to file an action taken report (ATR) in court on a plea seeking an FIR against AIMIM chief Asaduddin Owaisi in an alleged sedition case. The court had asked the police to file an ATR report on the complaint filed by Brijesh Chand Shukla of Swaraj Janata Party against the MIM) leader

Thursday 22 September 2016

నిజాం పేటలో పర్యటిస్తున్న కేటీఆర్


హైదరాబాద్ లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు, రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ నిజాంపేటలో పర్యటిస్తున్నారు. నిజాంపేట భండారి లే అవుట్ ను కూడా ఆయన పరిశీలించారు. వరద నీటిలో చిక్కుకున్న అపార్టుమెంట్ల గురించి ఆరా తీశారు. స్థానికుల కష్టాలను అడిగి తెలుసుకుంటున్నారు. అంతకుముందు, బేగంపేట్ లోని అల్లంతోట బావి, మయూరి మార్గ్ నాలాలను ఆయన పరిశీలించారు. కేటీఆర్ వెంట ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, మేయర్ బొంతు రామ్మోహన్ ఉన్నారు.

ఏ రోజు ఏ మూడ్ లో ఉన్నానో నా డ్రెస్సులే చెబుతాయి: సన్నీలియోన్


‘ఏ రోజు ఏ మూడ్ లో ఉన్నాననే విషయాన్ని నేను ధరించే డ్రెస్సులే చెప్పేస్తాయి’ అంటోది ప్రముఖ బాలీవుడ్ నటి సన్నీలియోన్. సినీ తారలైనంత మాత్రాన బయట కూడా గొప్పగా కనిపించాలా? అని చాలా మంది అనుకుంటూ ఉంటారని.. అలా కనిపిస్తూ, ఫ్యాషన్ దుస్తులు ధరిస్తేనే ప్రజలు గౌరవిస్తారనేది తన అభిప్రాయమని చెప్పింది. సెలబ్రిటీలు మంచి వ్యక్తులా? కాదా? అనే విషయం అనవసరమని, వారు ధరించే డ్రెస్సులను బట్టే ప్రజలు ఒక నిర్ణయానికి వస్తుంటారని సన్నీలియోన్ చెప్పింది. ఆ విధంగా ఆలోచించడం మానవుడి నైజమని, ఎదుటివారు ధరించే దుస్తులను బట్టే వారి స్థాయిని మనం అంచనా వేస్తుంటామని తెలిపింది. తాను ఫ్యాషన్ దుస్తులు ధరించినప్పుడు తన గురించి ఎవరేమనుకుంటున్నారన్నది తెలుసుకోవడం తనకు ఇష్టమని సన్నీలియోన్ తన మనసులో మాట చెప్పింది.

KCR in Delhi



ఢిల్లీ పర్యటనలో ఉన్న‌ తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఈరోజు కేంద్ర‌మంత్రి ద‌త్తాత్రేయ‌ను క‌లిసి, ప‌లు అంశాల‌పై చ‌ర్చించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో ద‌త్తాత్రేయ చొరవ చూపాలని ఆయ‌న కోరారు. నిన్న జ‌రిగిన అపెక్స్ కౌన్సిల్ స‌మావేశం గురించి ఆయ‌న ద‌త్త‌న్నకు వివ‌రించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్ర‌యోజనాల దృష్ట్యా పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా ముందుకెళ్లాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఆయ‌న అన్నారు. కేంద్రం నుంచి అందాల్సిన నిధులు ఆల‌స్యం కాకుండా అందాల‌ని అన్నారు. త‌న ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా రామగుండం ఫెర్టిలైజర్స్ ప్లాంట్ పునరుద్ధరణ ప‌నుల‌పై కేంద్రంతో చ‌ర్చించి, అందుకోసం సాయం చేయాలని కోరినట్లు చెప్పారు.

శ్రీకాళహస్తిలో సింధు ప్రత్యేక పూజలు


‘రియో’ ఒలింపిక్స్ లో రజత పతకం సాధించిన పీవీ సింధు ఈరోజు శ్రీకాళహస్తి ఆలయాన్ని సందర్శించింది. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆమెకు ఘనస్వాగతం పలికారు. అనంతరం, ఆమె రాహు, కేతు పూజలు నిర్వహించింది. పూజలు ముగిసిన తర్వాత తీర్థ ప్రసాదాలు స్వీకరించింది. సింధుతో పాటు బీజేపీ నేత, టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాశ్ రెడ్డి ఉన్నారు. కాగా, ఈ నెల 4వ తేదీన తన తల్లిదండ్రులతో కలిసి సింధు తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ఈ సందర్భంగా శ్రీవెంకటేశ్వరుడికి తులాభారం మొక్కు కింద 68 కిలోల బెల్లంను సింధు సమర్పించుకుంది.

వాగులో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు... హెలికాప్టర్లను రంగంలోకి దింప‌నున్న అధికారులు


గుంటూరు జిల్లాలో కురుస్తోన్న భారీ వ‌ర్షాల ధాటికి వాగులు వంకలు పొంగిపొర్లుతుండ‌డంతో ర‌హదారులపైకి నీరు వ‌చ్చేసింది. దీంతో వాహ‌నాల రాక‌పోక‌ల‌కు అంత‌రాయం ఏర్ప‌డింది. క్రోసూరు మండలంలోని వూటుకూరు వాగులో కొద్ది సేపటి క్రితం ప్రయాణికులతో వెళుతున్న ఆర్టీసీ బస్సు చిక్కుకుపోయింది. వాగు దాటుతున్న సమయంలో ఒక్కసారిగా వరదనీరు రావ‌డంతో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. 

బ‌స్సులో దాదాపు 45 మంది ప్రయాణికులు ఉన్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌యాణికుల్లో కొంద‌రు బ‌స్సుపైకి ఎక్కి కూర్చున్నారు. త‌మ‌ని ర‌క్షించమంటూ ఆర్త‌నాదాలు చేస్తున్నారు. స‌మాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్, జిల్లా కలెక్టర్‌ కాంతిలాల్‌ దండే వారిని కాపాడేందుకు హెలికాప్టర్లను రంగంలోకి దింప‌డానికి ప్రయత్నాలు జ‌రుపుతున్నారు. వారికి ఆహారాన్ని కూడా అందించాలని యోచిస్తున్నట్లు కొమ్మాలపాటి శ్రీధర్ మీడియాకు తెలిపారు.

Man Commits Suicide By Fall Under Car



Shocking CCTV Footage  Man Commits Suicide By Fall Under Car  Hyderabad

Friday 16 September 2016

Thanks to Government Efforts says Relatives of Abducted professors


MP Mallareddy and Nvssprabhakar MLA Met Hon'ble prime minister Sri NarendraModi along with the Relatives of Abducted professors for their Release . Finally thanks to the government efforts for their safe release by kidnappers in LIBYA

అమెజాన్ లో Refurbished మరియు Used స్మార్ట్ ఫోన్స్ సేల్స్ మొదలు


అమెజాన్ లో Refurbished మరియు Used స్మార్ట్ ఫోన్స్ సేల్స్ మొదలు



అమెజాన్ ఇండియా సైట్ లో ఇప్పుడు used మొబైల్స్ కూడా సెల్ అవనున్నాయి. దీనికి సంబంధించి అమెజాన్ ఈ రోజు నుండి అందరికీ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అందిస్తుంది.
అయితే ఆల్రెడీ నేను గతంలో అమెజాన్ లో used మొబైల్స్ ను చూశాను. used మరియు Refurbished స్మార్ట్ ఫోన్స్ కూడా ఉంటాయి.

రెండింటికీ తేడా ఏంటి?
used అంటే వేరే వ్యక్తి వాడినది, అమెజాన్ తక్కువ ప్రైస్ తో తక్కువ వారేంటి తో సేల్స్ చేస్తుంది. Refurbished కూడా అవే ఆప్షన్స్ ఉంటాయి. కాని Refurbished అంటే ఫోన్ తయారు చేసిన తరువాత చేసే ప్రొఫెషనల్ టెస్టింగ్ లో కనుగొన్న చిన్నపాటి హార్డ్ వేర్ లోపాలను సరి చేస్తూ కంపెని తిరిగి బ్రాండ్ నియమాలకు తగ్గట్టుగా ఉన్నప్పుడు resale చేస్తుంది. refurbished ఫోన్స్ sealed packaging లోనే ఉంటాయి.

అయితే ఇదేమీ కొత్త కాదు. చాలా సైట్స్ ప్రత్యేకంగా ఇలాంటి used, unboxed మరియు refurbished స్మార్ట్ ఫోన్స్ ను మాత్రమే సేల్స్ చేస్తున్నాయి.

ఇప్పుడు అమెజాన్ లో సెల్ అయ్యే ఈ ఫోన్స్ 3 విధాలుగా ఉండనున్నాయి. ఒకటి NEW, రెండవది Good, మూడవది Acceptable. ఈ మూడు టాగ్స్ తో సెల్ అవుతాయి refurbished అండ్ used ఫోన్స్.

NEW టాగ్ క్రింద ఉన్న ఫోనులు ఎటువంటి scratches లేకుండా బాగా పనిచేసే ఫోన్. Good అనే సెగ్మెంట్ లో కొద్దిపాటి గీతలు ఉండవచ్చు ఫోన్ పై. కాని బాగా పనిచేస్తున్నవి. ఇక Acceptable సెక్షన్ లో ఉన్న ఫోన్ బాగా పనిచేస్తుంటుంది కాని హార్డ్ వేర్ పరంగా స్క్రీన్ cracks, ఫోన్ బయట భాగంలో కనిపించేటట్టుగా బెంట్స్ ఉంటాయి. 

అమెజాన్ చేసే ఈ సెకెండ్ సేల్స్ లో used ఫోన్స్ లో అన్నిటికీ వారేంటి రాదు. కాని refurbished ఫోన్స్ కు 6 నెలల వారేంటి ఇస్తుంది. ఈ లింక్ లో అమెజాన్ refurbished మొబైల్స్ చూడగలరు.

ఎడిటర్ టిప్: Refurbished స్మార్ట్ ఫోన్స్ అనేవి కొనవచ్చు. ఎటువంటి ప్రమాదం లేదు. కాని కొనే ముందు అదే ఫోన్ కొత్తది ఎంత ప్రైస్ లో ఉంది చూడాలి. రెండింటికీ ఎక్కువ గాప్ ఉంటేనే కాని refurbished ప్రిఫర్ చేయటం సమంజసం కాదు. ఎక్కువ డిఫరెన్స్ తో ఉండే deals చాలా rare గా కనిపిస్తున్నాయి. అప్పట్లో నిజంగా ఎక్కువ గ్యాప్ ఉండేది. రెగ్యులర్ గా రోజూ సైట్స్ ను చెక్ చేస్తేనే కాని మీకు మంచి డీల్ దొరకదు.

Saturday 10 September 2016

చావడానికి సిద్ధం: చంద్రబాబు-వెంకయ్యకు పవన్ కళ్యాణ్ కౌంటర్


అమరావతి: జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో బీజేపీకి ధీటైన సమాధానం ఇచ్చారు. హోదా వల్ల ఎలాంటి ప్రయోజనాలు లేనప్పుడు ఎందుకు హామీ ఇచ్చారో చెప్పాలని నిలదీశారు. ప్రత్యేక హోదా బీజేపీ వాళ్లే కావాలంటారని, మళ్లీ వాళ్లే వద్దంటారని అన్నారు.
ఓ సందర్భంలో ఆయన మాట్లాడుతూ.. తాను చావడానికైనా సిద్ధమన్నారు. ప్రత్యేక హోదా పైన ఇచ్చిన మాట తప్పవద్దన్నారు. హోదా వల్ల ప్రయోజనం లేనప్పుడు విభజన సమయంలో ఎందుకు అడిగారో చెప్పాలని నిలదీశారు. ఆయన బీజేపీ నేత వెంకయ్యను, సీఎం చంద్రబాబును నిలదీసారు.
నాయకులు నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతూ ఇలా మాటలు మార్చేస్తుంటే ఏం చేయగలమన్నారు. ఒక్కోసారి ఒక్కో మాట చెబుతుంటే ప్రజలు ఎలా నమ్మాలన్నారు. హోదా ఇవ్వమని, హోదా వల్ల ఎలాంటి ఉపయోగం లేదని ఎన్నికల సమయంలో ఎందుకు చెప్పలేదో చెప్పాలన్నారు.
హోదా తెచ్చేస్తానని వెంకయ్య ఎందుకు ఆ రోజు చెప్పారు? హోదా రాష్ట్రానికి తీసుకొచ్చే బాధ్యత తనది అని చంద్రబాబు ఎందుకు అన్నారు? అని నిలదీశారు.
తల్లిని చంపి, బిడ్డను బతికించారని, కహోదా కల్పించి ఏపీని ఆదుకుంటా'మని మోడీ ఎన్నికల ప్రచారంలో ఎందుకు చెప్పారన్నారు. ఆ రోజు చెప్పారు కాబట్టే వారిని నిలదీస్తున్నామన్నారు. ఓట్లడిగినప్పుడు అందరికీ అర్థమయ్యేలా, ఇచ్చేటప్పుడు అర్థం కాకుండా మాట్లాడుతారన్నారు.
ఎంతో మంది ఐఏఎస్‌లు తనతో మాట్లాడుతూ... పార్లమెంటులోను, కేంద్రమంత్రుల దగ్గర మన ఏపీ ఎంపీలు ఏమీ మాట్లాడరని చెప్పారని, కాంట్రాక్టులు, సొంత పనుల గురించి మాత్రమే ఎంతో మాట్లాడుతారని, అలాంటి వారు రాష్ట్రం దగ్గరికి వచ్చేసరికి నోరు మూసుకుని ఉంటారని వారు తనతో అన్నారని చెప్పారు.
ఇవన్నీ నేను చెబితే నిరూపించమంటారని, అది ఎలా సాధ్యమన్నారు. ఒకవేళ అలా నిరూపిస్తే ఏం చేస్తారు.. మహా అయితే రాజీనామా చేస్తారన్నారు. అంతకుమించి ఏం చేస్తారన్నారు. బిజెపి, టిడిపి నేతలే తనపై విమర్శలు చేస్తుంటారని పవన్ కళ్యాణ్ అన్నారు.
టిడిపి, బిజెపి నేతలే హోదా కావాలంటారని, మళ్లీ వారే ప్యాకేజీ ముద్దు అని చెబుతారని ఇదేమిటన్నారు. వాళ్లు అడిగిందే తాను అంటే విమర్శలు చేస్తున్నారని నన్ను తిడతారని వ్యాఖ్యానించారు. కేంద్రం ఏపీకి ఏం చేయడం లేదని, రాష్ట్రం కష్టాల్లో ఉందని చంద్రబాబు పదేపదే ఎందుకు చెబుతున్నారని ప్రశ్నించారు.
చంద్రబాబు చెబుతున్నట్టు ఆయన ప్రాక్టికల్ మనిషే అయితే ఈ రెండేళ్ల కాలం ఎందుకు వృథా చేశారని నిలదీశారు. రెండేళ్ల ముందే ఈ ప్యాకేజీ తీసుకుని ఉండి ఉంటే ఈ సమయం కలిసి వచ్చేదన్నారు. కడుపు మండడంతోనే సభలు, సమావేశాల్లో ఉద్వేగంగా, ఆవేశంతో, ఆవేదనతో మాట్లాడుతానని చెప్పారు.
తాను మాత్రమే ఆవేశపడతానని, తన కార్యకర్తలు, అభిమానులను మాత్రం సంయమనంతో వ్యవహరించమని చెబుతానన్నారు. వారు కూడా తనలా ఆవేశపడితే ఎంత నష్టం జరుగుతుందో తనకు తెలుసునని చెప్పారు. దేశం మారాలని కోరుకునే కొత్త జనరేషన్ ఉందని, వారితోనే ప్రపంచం మొత్తం కలుస్తుందని, వారికి ప్రతినిధులుగా ప్రజలు నిలబడాల్సిన అవసరం ఉందన్నారు.

కేవీపీ పట్టువీడని విక్రమార్కుడు: వెంకయ్య నాయుడు


న్యూ ఢిల్లీ: కాంగ్రెస్ నేత కేవీపీ పట్టువీడని విక్రమార్కుడని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ప్రశంసలు కురిపించారు. ఇవాళ హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇప్పుడు హోదా, ప్యాకేజీ కావాలని ఆరాట పోరాటం చేస్తున్న యోధులందరూ అప్పుడు ఎక్కడున్నారో ఒకసారి చెబితే బాగుంటుంది.. అప్పుడు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ప్రత్యేక ఆంధ్రప్రదేశ్, ప్రత్యేక తెలంగాణ వద్దని ఎవరూ పోరాడలేదు.. అలా పోరాడిన ఏకైక వ్యక్తల్లా కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావు అంటూ వెంకయ్య చెప్పుకొచ్చారు. ఆయన పట్టువదలని విక్రమార్కుడని ఆయన ప్రశంసించారు. కేవీపీ తప్ప మిగతా వారంతా ఆనాడే సర్దేశారని వెంకయ్య తెలిపారు. కాగా పవన్ తిరుపతి, కాకినాడ సభలో బీజేపీ చేసిన విమర్శలు తిప్పికొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయ్.!

'కాటమరాయుడి' విమర్శలు తిప్పి కొట్టే యోచనలో కేంద్రం.!


ప్రముఖ నటుడు, జనసేన అధినేత పార్టీ స్థాపించిన నాటి నుంచి పెద్దగా సభలు, ప్రెస్‌మీట్లు నిర్వహించింది చాలా తక్కువే.. అయితే ఈ గత నెల రోజుల వ్యవధిలోనే రెండుసార్లు బహిరంగ సభలు నిర్వహించడం.. ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను టార్గెట్ చేస్తూ మాట్లాడారు పవన్. కాకినాడ సభలో అయితే ఏకంగా ప్రధాని మోదీ, వెంకయ్య పేర్లు ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు. ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన మోదీ సర్కార్ రెండు పాచిపోయిన లడ్డూలు ఇచ్చి సరిపెట్టుకుందంటూ పవన్ ఆగ్రహంగా మాట్లాడిన విషయం తెలిసిందే.! ఇక వెంకయ్య నాయుడి గురించి మాట్లాడుతూ మాననీయ వెంకయ్య జీ.. అని మొదలుకుని ప్రసంగాన్ని ఎక్కడికో తీసుకెళ్లారు పవన్.

అయితే తాజాగా వెంకయ్య నాయుడు స్పందిస్తూ నేను ఎవరికీ సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు.. నేను ప్రజలకే జవాబుదారి.. వారికి మాత్రమే సమాధానం చెబుతానంటూ క్లారిటీ ఇచ్చారు. అంతటితో ఆగని ఆయన నన్ను కొందరు వ్యక్తిగతంగా దూషిస్తున్నారు..

అది పద్ధతి కాదంటూ కౌంటరిచ్చారు. కాగా శనివారం ఏపీకి చెందిన బీజేపీ నేతలంతా ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. ప్యాకేజీ ఇచ్చిన తరువాత జనాలు ఏమనుకుంటున్నారు.. అసలు పరిస్థితేంటి అని ఆరా తీసినట్లుగా తెలుస్తోంది.

అయితే ఆ సమావేశంలో పవన్ ప్రస్తావన వచ్చినట్లుగా సమాచారం.? అస్తమాను సభలు పెట్టి బీజేపీని విమర్శిస్తుండటంతో మోదీ, బీజేపీ పెద్దలు పవన్ విమర్శలను తిప్పి కొట్టాలని యోచనలో ఉన్నారని తెలుస్తోంది.? ఇందుకు కేంద్ర మంత్రి వెంకయ్య ద్వారా పవన్‌కు కౌంటర్లు ఇచ్చేందుకు సిద్ధమైనట్లుగా సమాచారం.? పైగా వెంకయ్యే ఇవాళ ప్రెస్ మీట్ పెట్టనున్నారు.

దీంతో కేంద్రం పవన్ విమర్శలను తిప్పి కొట్టేందుకు సిద్ధమైంది అనే వార్తకు మరింత బలం చేకూరుతోంది. మరి వెంకయ్య పవన్ పై ఏం ప్రశ్నలు సంధించనున్నారు.. అసలు పవన్ ఎలాంటి కౌంటర్లు, పంచ్‌లు పేల్చాలాని ఇప్పటికే పుల్ పిల్‌గా స్క్రిఫ్ట్‌ కూడా సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది.!.

Fake Police Created Terror in Cyberabad limits


Fake police once again created terror under Cyberabad police limits

A man belonging to Devarakonda, Nalgonda district was stopped on the pretext of frisking and robbed off 1.40 lakh.

According to sources Srinivas (44) belonging to Devarakonda works with Narendra. Both came to Hyderabad for purchasing poultry feed. The incident occurred on their return, near Sagar Ring Road.

According to sources on the direction of his boss Narendra, Srinivas was going to LB Nagar through Sagar Ring Road when two persons on bike stopped him and searched his bag on the pretext of frisking. One diverted his attention by asking him to call his owner; meanwhile the duo decamped with the bag.

Fake Currency Racket busted, 3 Arrested in Hyderabad


Fake currency racket busted, 3 arrested
Commissioner's Task Force, South Zone Team, Hyderabad, with the assistance of Charminar Police, on Friday arrested three persons and seized a huge quantity of counterfeit currency notes from their possession. The police arrested Mohd Ghouse, Shareeful Shaik and one Jahanara Bibi. The police also seized Rs 11,95,000 cash, counterfeit Indian currency in Rs 1,000 and Rs 500 denominations, one Activa motorcycle and two cell phones from their possession.
The police said Mohd Ghouse was previously involved in counterfeit currency cases under the limits of Monda Market, Gopalapuram, Kanchanbagh, Shahalibanda, Kalapathar, Bhavaninagar, Chandrayangutta, Mirchowk and Falaknuma Police Stations. Recently, he was released from jail and revived his old contacts in Malda district of West Bengal, who were previously involved in supplying of counterfeit currency.
In this context, about 10 days ago, he contacted one of his old suppliers, Babloo Shaik alias Babloo of Malda, West Bengal, and ordered fake Indian currency. Subsequently, Babloo, on September 7, sent Rs 12 lakh worth fake currency notes through his mother Jahanara Bibi and his brother-in-law Shareeful Shaik of West Bengal to Hyderabad to hand over the same to his customer Mohd Ghouse by giving his contact number.
On Friday, at about 08.00 hours, Mohd Ghouse met Shreeful Shaik and Jahanara Bibi at Charminar and during the transactions, they were caught red-handed with Rs 11,95,000 fake Indian currency notes. Babloo Shaik, the prime accused in the case, was arrested. The seized fake currency is of high quality and cannot be identified easily, the police said. The accused and the seized property were handed over to the SHO, Charminar Police Station.
The arrests were made under the supervision of N Koti Reddy, Additional Deputy Commissioner of Police, Commissioner’s Task Force, Hyderabad City, A Yadagiri, Inspector of Police, South Zone Task Force, K Chandra Sekhar Reddy, Inspector of Police, Charminar Police Station, SIs N Srishylam, B Madhusudan and G Mallesh with the assistance of staff.

Telangana Government Banned Cow Slaughter for Bakrid !


Telangana government on Friday warned of stern action against those indulging in slaughter of cows in connection with Bakr-Eid or Eid al-Adha.
Maintaining that cow plays a vital role in rural economy, a circular issued in Hyderabad by state animal husbandry department said culprits will be punished as per Prohibition of Cow Slaughter and Animal Preservation Act.
"This is to inform the public that nobody should indulge in meting out cruelty to animals and killing of cows. Anybody found involved in those acts, will be punishable as per law," the notification read.
The government appealed to public to inform police, revenue and transport departments in case they come across such incidents. The department would take necessary steps to prevent killing of cows during Bakra Eid (Eid ul-Adha) season as it witnesses surge in consumption of meat, director of Animal Husbandry department, D. Venkateswarlu said.
"We along with police and GHMC (Greater Hyderabad Municipal Corporation), are conducting surprise checks to see if the laws are violated. No female animal of any kind should be slaughtered during the season while cows should not be killed anytime," he said.

4.30 lakh voters deleted from Greater Hyderabad list


4.30 lakh voters deleted from Greater Hyderabad list

As many as 4.30 lakh voters were deleted from 25 Assembly constituencies of Greater Hyderabad limits covering Hyderabad, Rangareddy and Medak districts during the summary revision of electoral rolls.

Of them, about 2,42,584 are men, 1,88,069 are women and 49 are third gender voters. The Greater Hyderabad Municipal Corporation (GHMC) published the final rolls on Friday.

As per the final publication of electoral rolls, the total electors in the GHMC limits now stand at 82,65,005 and of them 44,08,399 are men, 38,55,291 are women and 1,314 belong to the third gender.

GHMC officials told Express that summary revision of electoral rolls was taken up between October 2015 and August 2016. During the exercise, some 4.30 lakh voters’ names were deleted which were found to be bogus, duplicate voters due to change of house from constituency to another constituency or dead.

Kukatpally tops the list with highest number of voter deletions with 39,520 followed by Serilingampally with 35,180, LB Nagar with 35,060 and Qutbullapur with 32,124.

These constituencies have large presence of voters from Andhra Pradesh. GHMC officials said that the revision was done in a transparent manner without any bias.

Compared to last year, there is a marginal increase of 2.08 lakh voters this year. Last year, the total voters were 80,56,944 including 43,06,971 men, 37,48,878 women and 1,095 third gender voters

5-Day wait for victim at Gandhi Hospital


5-day wait for victim at Gandhi Hospital
A 27-year-old man from Adilabad with deep burns was refused admission in Gandhi Hospital for five days despite entreaties from his mother to the doctors to save his life. Nitish and his mother waited in the corridor outside the garden area of the out-patient department for five days from August 9 till a Good Samaritan got him admitted in a private hospital.
Nitish suffered burns on his chest, neck, hands and abdomen in a fire at his house in July. He was admitted to the Adilabad district hospital, but it could not give him proper treatment. He developed folds in the skin. The neck developed multiple folds and beca-me stiff, as did his hands. Movement was restricted. Wearing clothes also became difficult and he required skin grafting. As the condition worsened, doctors referred him to Gandhi Hos-pital. They reached the hospital on August 9, and spent the next five days on the lawn
Mother’s pleas were ignored
Nitish and his mother arrived in the city on August 9 and went to Gandhi Hospital to get admitted. They were directed to the out-patient department where they were told to wait. K Shakuntala, mother of Nitish said "At the out-patient department there was no doctor to examine him. They merely told us to wait for the plastic surgeon who they said will be available only on Tuesdays and Thursdays. I begged them to atleast admit my son and start some treatment could be given. But no one listened to us."
Nitish and his mother spent day and night at the garden area waiting for someone to help. She would frequently check with the staff if a doctor is available to examine her son but received no response. Fortunately, social worker Azhar Maqsusi saw Nitish’s plight and helped him get admitted at a private hospital. When this newspaper sought a response from Superintendent of Gandhi Hospital Dr K.J. Reddy about the incident, he washed hands of the matter: “I am not aware of this case. If such a person was found lying in the corridor, the RMOs are alerted. We treat hundreds of patients in our burns wards everyday who require months of treatment. Nobody is denied treatment. We will inquire into what has gone wrong. Patients referred from Adilabad district hospital usually come with a reference letter. It has to found out if the letter was procured and also if help at the hospital was denied to them.”

China's first "Airplane Restaurant"



China's first "airplane restaurant", which features a restaurant built entirely inside of a retired Boeing 737 cabin, opened on September 9 in central China's Wuhan city.
The jet retired from an Indonesian airline costed the owner some 35 million RMB (5.23 million USD) to be refurbished into a restaurant. To make customers' experience more complete, all waitresses working in the restaurant dress in flight attendants' uniforms.

GHMC May get 500 cr.



GHMC may get Rs.500 cr. by reassessing properties
Last year, it earned Rs. 1050 crore in property tax and it had to give up Rs.88 crore following the Government’s decision to waive tax for properties.
Greater Hyderabad Municipal Corporation (GHMC) is banking on property tax reassessments for commercial properties, newly constructed buildings and those under the Rs. 1200 payment per annum bracket to increase its property tax collection by Rs. 500 crore for this year.
Last year, it earned Rs. 1050 crore in property tax and it had to give up Rs.88 crore following the Government’s decision to waive tax for properties paying Rs. 1200 per annum and below. With the Government sitting on the proposal to hike the property tax rates which were earlier raised for residential properties in 2002 and commercial in 2007, the municipal corporation has been forced to look within to raise resources.
Commissioner B. Janardhan Reddy at a meeting with his senior staff on Thursday wanted them to concentrate on these categories and also trade licence fees to obtain more revenue. He pointed out that by checking the veracity of 60,613 properties paying Rs. 1200 as tax, about 26,219 properties were reassessed and Rs. 14.34 crore was realised.
Therefore, he reasoned, if the Deputy Commissioners and bill collectors diligently scan through the remaining five lakh properties under the same tax band, Rs. 100 crore can be collected even if 50 per cent is verified thoroughly. Similarly, there were 1.40 lakh commercial properties but 40,000 had taken trade licences last year while the figure this year is 35,000. Hence, there should be focus on bringing them into the tax net and also look into the fines being charged for those not taking trade licenses.
TSSCPDCL data
Mr. Reddy advised the officers to make use of the data of the TSSCPDCL and commercial tax departments as well as phone numbers of the tax payers to collect precise information about the properties and also to send tax updates and payment schedules.
Central and State Government properties number about one lakh and up to Rs. 180 crore can be realised from them so also by reviewing the fee from municipal estates and check bounce cases.

Wednesday 7 September 2016

సికింద్రాబాద్‌లో కారు బీభత్సం


అడ్డగుట్ట: సికింద్రాబాద్‌లోని రైలు నిలయం సమీపంలో బుధవారం ఉదయం ఓ కారు బీభత్సం సృష్టించింది. అదుపుతప్పి పుట్‌పాత్‌పై ఉన్న చెరకు బండి, టీ స్టాల్‌ను ఢీకొట్టింది. ఎస్సై సామ్యానాయక్‌ కథనం ప్రకారం సికింద్రాబాద్‌ సంగీత్‌ చౌరస్తా నుంచి తార్నాక-ఉప్పల్‌ వైపు వెళ్తున్న హ్యుందాయ్‌ ఐ-20 కారు అధిక వేగంతో ప్రయాణిస్తూ రైల్యే నిలయం సమీపంలో అదుపుతప్పి ఫుట్‌పాత్‌పై వున్న టీ స్టాల్‌, చెరుకురసం బండి, పాన్‌ డబ్బాలను ఢీకొట్టింది. అనంతరం పక్కనే ఉన్న ప్రహరీ గోడను బలంగా ఢీకొట్టడంతో ఆగింది. ఈ ప్రమాదం తెల్లవారు జామున జరగడం, జనసమ్మర్థం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు కూడా సీటు బెల్టు పెట్టుకోవడంతో ఎలాంటి గాయాలు కాలేదు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. 

ఇంటి నుంచే పార్కింగ్‌ : GHMC


ఇంటి నుంచే పార్కింగ్‌ - GHMC





హైదరాబాద్‌: రైలు... బస్సు... విమానం... సినిమా టిక్కెట్లలా హైదరాబాద్‌లో పార్కింగ్‌ ప్రాంతాలకూ ముందస్తు బుకింగ్‌ వచ్చేస్తోంది. మెట్రో నగరాల్లో పార్కింగ్‌ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌లో ఈ విధానం తెరపైకి రానుంది. ఇంటి నుంచి బయటకు వచ్చేప్పుడే వాహన చోదకులు అవసరమైన ప్రాంతంలో నిర్ణీత రుసుం చెల్లించి అనువైన ప్రాంతాన్ని ఎంపిక చేసుకునే సౌకర్యాన్ని ట్రాఫిక్‌ పోలీసులు త్వరలో అందుబాటులోకి తీసుకువస్తున్నారు.
చరవాణిలో 'స్మార్ట్‌యాప్‌' ద్వారా వాహన చోదకులు దీన్ని వినియోగించుకోవచ్చు. వాణిజ్య ప్రాంతాల్లో కార్లు, బైకులు నిలిపేందుకు స్థలం లేకపోవడం... రహదారిపై ఐదంటే.. ఐదే నిమిషాలు వాహనాన్ని నిలిపితే పోలీసులు చలానా విధించడం... పిల్లాపాపలు.. కుటుంబ సభ్యులతో షాపింగ్‌, భోజనం, షికారుకు వచ్చేప్పుడు ఆయా ప్రాంతాలకు వెళ్లగానే అక్కడ వాహనాలు నిండుగా ఉండడం వంటి వాటిని దృష్టిలో ఉంచుకుని పోలీసు ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. మొబైల్‌ యాప్‌ ద్వారా సేవలందించే సంస్థలను గుర్తించేందుకు ఇటీవలే ముంబయిలో జరిగిన ట్రాఫిక్‌ ఎక్స్‌పోకు వెళ్లారు. అక్కడ తమ ప్రతిపాదనలను కార్పొరేట్‌ కంపెనీలకు వివరించారు.
కొత్త ప్రాంతాలు, జీహెచ్‌ఎంసీ స్థలాలు.. 
నగరంలో పార్కింగ్‌ ప్రాంతాల్లో అడ్డగోలుగా వసూలు చేస్తున్నారంటూ వాహన చోదకులు, కొన్ని సంస్థల నుంచి ఫిర్యాదులు రావడంతో ట్రాఫిక్‌ ఉన్నతాధికారులు జీహెచ్‌ఎంసీ అధికారులతో చర్చించి అధిక మొత్తం వసూలు చేస్తున్న వారి కాంట్రాక్టను రద్దు చేయించారు. సుమారు 200 ప్రాంతాల్లో ఉచితంగా పార్కింగ్‌ సౌకర్యం కల్పించారు. కొత్తగా మరికొన్ని ప్రాంతాలతో పాటు ప్రైవేటు స్థలాల్లో పార్కింగ్‌ రుసుం వసూలు చేస్తున్నారు. వీటన్నింటినీ పరిశీలించిన ట్రాఫిక్‌ అధికారులు ప్రైవేటు స్థలాలకు సమీపంలో జీహెచ్‌ఎంసీ స్థలాలను గుర్తించారు. ఇలా కొత్తగా వచ్చిన వాటిలో దాదాపుగా 1,080 ప్రాంతాల్లో వాహనాలు నిలిపేందుకు వీలు కల్పించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. మరోమారు చర్చించాక అధికారికంగా ఖరారు చేయనున్నారు.


చరవాణి ద్వారానే అన్నీ... 
చరవాణిద్వారా 'స్మార్ట్‌యాప్‌' డౌన్‌లోడ్‌ చేసుకున్న అనంతరం ద్విచక్ర వాహనం, కార్లు, ఆటోలు ఇతర వాహన చోదకులు వాణిజ్య ప్రాంతాలు, బహుళ అంతస్థుల భవనాలు, ప్రభుత్వ కళాశాలలు, బహిరంగ ప్రదేశాలన్నీ యాప్‌లో ఉంటాయి. వీటిలో వాహన చోదకులు ఎంచుకున్న ప్రాంతాల్లో వాహనాలు నిలిపే స్థలం ఉందా?లేదా? అన్నది తెలుస్తుంది. సమీపంలో ప్రత్యామ్నాయ ప్రాంతాలున్నాయా? లేదా? రద్దీగా ఉంటే ఎంతసేపటిలో ఖాళీ అయ్యే అవకాశాలు ఉన్నాయన్న సమాచారం మొబైల్‌ యాప్‌లో ఉంటుంది. ఉదాహరణకు బంజారాహిల్స్‌లో ఉంటున్న వ్యక్తి కారులో పిల్లలను తీసుకుని ఆబిడ్స్‌లో వస్తువులు కొనుగోలు చేయాలనుకుంటే... ఇంటి నుంచి బయలు దేరేప్పుడే యాప్‌ ద్వారా వాహనం నిలిపే స్థలాన్ని ముందస్తుగా తీసుకోవచ్చు. సదరు వ్యక్తి అక్కడికి చేరుకోగానే వాహనం కోసం స్థలం ఉంటుంది. నిర్ణీత రుసుం చెల్లించి ఆయా ప్రాంతంలో ఉన్న రద్దీ దృష్ట్యా 15 నిముషాల నుంచి గంట వరకూ ఉండొచ్చు. ప్రవేటు సంస్థల్లా రద్దీ సమయాల్లో ఎక్కువ ధరలు, 30 నిముషాలు దాటితే రెట్టింపు రుసుం వంటి షరతులుండవు.

కమాండ్‌ కంట్రోల్‌ నుంచి పర్యవేక్షణ 
స్మార్ట్‌యాప్‌ ద్వారా పార్కింగ్‌ ప్రాంతాల్లో ఏం జరుగుతోందన్నది కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం నుంచీ పర్యవేక్షించవచ్చు. వాహన చోదకులు ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా... రుసుం తీసుకునే విషయంలో అధికంగా వసూలు చేసినా, వాహన చోదకులతో దురుసుగా ప్రవర్తించినా వెంటనే అక్కడున్న సిబ్బందిపై చర్యలు చేపట్టనున్నారు. పార్కింగ్‌ ప్రాంతాల వద్ద నేరుగా డబ్బు వసూలు చేయకుండా మొబైల్‌ యాప్‌ ద్వారా చెల్లించే వెసులుబాటు కల్పించనున్నారు. ఈ విధానం వాహన చోదకులకు ప్రయోజనకరంగా ఉంటుందని అదనపు పోలీసు కమిషనర్‌(ట్రాఫిక్‌) జితేందర్‌ తెలిపారు. పార్కింగ్‌ ప్రాంతాల్లో వాహనాలు నిలిపేందుకు ప్రత్యేక గీతలుంటాయని, అంతిమంగా పార్కింగ్‌ ప్రాంతాల పరిసరాల్లో ట్రాఫిక్‌ చిక్కులను పరిష్కరించేందుకు ఈ కొత్త ప్రణాళికను రూపొందించామని వివరించారు.

కాంగ్రెస్‌కి ఓటేస్తే క్యాన్సర్‌కు ఉచిత చికిత్స - అమరీందర్‌ సింగ్‌



ఫరీద్‌కోట్‌: కాంగ్రెస్‌కి ఓటేసి అధికారంలోకి తీసుకొస్తే రాష్ట్ర ప్రజలకు క్యాన్సర్‌ వ్యాధికి ఉచిత వైద్యం అందిస్తామని పంజాబ్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు అమరీందర్‌ సింగ్‌ తెలిపారు. కొట్కపుర నియోజకవర్గంలో నిర్వహించిన 'హల్కే విచ్‌ కెప్టెన్‌'(నియోజకవర్గంలో కెప్టెన్‌) కార్యక్రమంలో భాగంగా ఆయన ఈరోజు ప్రజలతో మాట్లాడారు. క్యాన్సర్‌ బారిన పడినవారికి సరైన చికిత్స చేయించలేని స్థితిలో ఉన్న పేదలు ఆత్మీయులను కోల్పోతున్నారన్నారు. అందుకే తాము అధికారంలోకి వస్తే క్యాన్సర్‌ రోగులకు ఉచిత వైద్యం అందజేస్తామని తెలిపారు.

24 గంటల్లోగా వెబ్‌సైట్లోకి.. ఎఫ్‌ఐఆర్‌లు- SC


దిల్లీ: కేసు నమోదు చేసిన 24 గంటల్లోగా సదరు ఎఫ్‌ఐఆర్‌లను ఆయా వెబ్‌సైట్లలో అప్‌లోడ్‌ చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పోలీస్‌ శాఖలను సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.
ఎఫ్‌ఐఆర్‌ను 24 గంటల్లోగా వెబ్‌సైట్లో అప్‌లోడ్‌ చేయాలంటూ ఇటీవల దిల్లీ హైకోర్టు నగర పోలీసులను ఆదేశించింది. దీంతో హైకోర్టు తీర్పును ప్రస్తావిస్తూ.. భారత యువ లాయర్ల అసోసియేషన్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై విచారించిన న్యాయస్థానం..

దిల్లీ హైకోర్టు ఆదేశాలను అంగీకరిస్తూనే, కొన్ని మార్పులు చేసింది.

అన్ని రాష్ట్రాల పోలీస్‌ అధికారులు 24 గంటల్లోగా ఎఫ్‌ఐఆర్‌ను వెబ్‌సైట్లో అప్‌లోడ్‌ చేయాలని ఆదేశించింది. తొలుత 48 గంటల సమయం ఇవ్వాలని భావించినప్పటికీ.. 24 గంటల పరిమితినిస్తూ తీర్పు చెప్పింది. ఇంటర్నెట్‌ సదుపాయం సరిగా లేని ప్రాంతాల్లో మాత్రం 72 గంటల్లోగా అప్‌లోడ్‌ చేసేందుకు అనుమతినిచ్చింది. కాగా.. మహిళలు, చిన్నారులపై లైంగిక వేధింపుల లాంటి కేసుల్లో ఎఫ్‌ఐఆర్‌ను అప్‌లోడ్‌ చేయడంలో మినహాయింపు కల్పించింది.

కొత్త జిల్లాల ఏర్పాటుకు నిధులు విడుదల

హైదరాబాద్‌: తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఒక్కో జిల్లా ఏర్పాటు ప్రక్రియ కోసం రూ.కోటి చొప్పున విడుదల చేస్తూ ప్రణాళికా శాఖ బుధవారం ఉత్తర్వులు వెలువరించింది. హైదరాబాద్‌ మినహా ప్రతిపాదిత 26 జిల్లాలకు రూ.కోటి చొప్పున విడుదల చేశారు. కొత్త జిల్లాల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రత్యేక నిధినుంచి ఈ నిధులను విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు.

రైతులకు మెరుగైన సేవలు అందిస్తాం : మంత్రి హరీష్ రావు


రైతులకు మరింత మెరుగైన సేవలు అందిస్తాం
జాతీయ వ్యవసాయ మార్కెట్-నామ్ వర్క్ షాప్ బంజారాహిల్స్ లోని అడ్మినిస్ట్రేటివ్ స్టాప్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో ప్రారంభమైంది. నామ్ వర్క్ షాప్ ను మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ వర్క్ షాప్ కు పది జిల్లాల మార్కెటింగ్ శాఖ అధికారులు హాజరయ్యారు. రైతులకు మెరుగైన సేవలందించడానికి మార్కెటింగ్ శాఖ, ఆస్కి ల మధ్య ఒప్పందం కుదిరింది. 44 వ్యవసాయ మార్కెట్లలో నామ్ అమలు కానుంది. దీని ద్వారా దేశంలోని ఏ వ్యాపారైనా ఆన్ లైన్ లో రైతుల వద్దనుంచి పంటను కొనే అవకాశం లభించనుంది. ఫలితంగా రైతుకు మద్దతుధర దొరకనుంది.
రైతులకు మరింత మెరుగైన సేవలు అందించడమే మార్కెటింగ్ శాఖ లక్ష్యమని మంత్రి హరీష్ రావు అన్నారు. రైతు బజార్లను మరింత పటిష్టం చేస్తామన్నారు. ప్రతి రెవెన్యూ డివిజన్, నియోజకవర్గ కేంద్రంలో రైతు బజార్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. కూరగాయాలు, పండ్లు నిల్వ చేసేందుకు కోల్డ్ స్టోరేజ్ లు ఏర్పాటు చేస్తామన్నారు.
నాణ్యమైన పంటలతో రైతులకు రెట్టింపు ఆదాయం వస్తుందని హరీష్ రావు అన్నారు. మార్కెటింగ్ శాఖ లో సాంకేతికతను ఉపయోగించి సేవలను విస్తరించేందుకు కృషిచేయాలన్నారు. పెసర్ల అంశంపై కేంద్రంతో చర్చించామని, కేంద్ర ప్రభుత్వ సంస్థలు మద్దతు ధర చెల్లించి కొనడానికి ముందుకు వస్తున్నాయని చెప్పారు. తొందరపడి రైతులు పెసర్లను వ్యాపారులకు అమ్మొద్దని మంత్రి సూచించారు. రెండుమూడు రోజుల్లోనే కేంద్రం పెసర్లను కొంటుందని తెలిపారు.
రెండు రోజుల పాటు జరుగనున్న వర్క్ షాప్ లో నామ్ పై మార్కెటింగ్ శాఖ అధికారులకు శిక్షణ ఇవ్వనున్నారు.

ఆసియాలోనే అతిపెద్ద స్టార్టప్ సదస్సు 'ఆగస్ట్ ఫెస్ట్


అద్భుత ఆవిష్కరణల కేంద్రంగా తెలంగాణ
- రాష్ట్రంలో పరిశోధనలకు ప్రాధాన్యం..
- 'ఆగస్ట్ ఫెస్ట్'లో మంత్రి కేటీఆర్

తెలంగాణను స్టార్టప్‌ల రాష్ట్రంగానే కాకుండా అద్భుత ఆవిష్కరణల కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు చెప్పారు. నగరంలోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో ఆసియాలోనే అతిపెద్ద స్టార్టప్ సదస్సు 'ఆగస్ట్ ఫెస్ట్'ను మంత్రి శనివారం ప్రారంభించారు. రెండు రోజుల ఈ సదస్సులో కేటీఆర్ మాట్లాడుతూ.

'నగరంలో త్వరలో రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ (రిచ్) పేరిట ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. తద్వారా రాజధానిలోని పరిశోధన సంస్థలు నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించే అవకాశం ఉంటుంది.
దేశంలోని ప్రముఖ పరిశోధన సంస్థల్లో దాదాపు 30 ఇక్కడే ఉన్నాయి. వీటి సహకారంతో రిచ్‌ను ఏర్పాటు చేస్తాం. సీసీఎంబీ, ఐఐసీటీ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు మార్కెట్ అవసరాలకు అనుగుణంగా పరిశోధనలు జరపాలి. నూతన ఆవిష్కరణల ద్వారా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు పెట్టుబడిదారులు కూడా వస్తారు. 

టీ హబ్ కేవలం స్టార్టప్‌లకే పరిమితం కాకుండా ఇతర ఇంక్యుబేటర్లు, స్టార్టప్‌లకు ఊతమిస్తోంది. రూరల్ టెక్నాలజీ పాలసీలో భాగంగా రూరల్ ఇంక్యుబేటర్లను ప్రోత్సాహిస్తాం. వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ వంటి ప్రాంతాల్లో స్టార్టప్‌ల కోసం ఏర్పాట్లు చేస్తున్నాం. వాట్సప్ సంస్థను 19 బిలియన్ డాలర్లకు అమ్మారు. అది అమెరికాలో ఉండడంవల్లే అంత ప్రాధాన్యతతో భారీగా డబ్బులు రాగలిగాయి. అంతటి విలువ రావాలంటే సరైన సమయం, ప్రాంతంలో, అవసరమైన సంస్థలను నెలకొల్పాల్సిన అవసరం ఉంది' అన్నారు.
నవంబర్ 5న టీ ఫండ్.
వెంచర్ క్యాపిటలిస్టులను రాష్ట్రానికి ఆకర్షించడంతో పాటు స్టార్టప్‌లను ప్రోత్సహించే లక్ష్యంతో నవంబర్ 5న 'టీ ఫండ్'ను ప్రారంభిస్తున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. టీ ఫండ్‌లో రాష్ట్ర ప్రభుత్వం కూడా గణనీయమైన మొత్తాన్ని పెట్టుబడిగా పెడుతుందన్నారు. 'భారతీయ, తెలంగాణ స్టార్టప్‌లను ప్రపంచ స్థాయి మార్కెట్లు, వెంచర్ క్యాపిటలిస్టులకు దగ్గర చేసే ప్రయత్నాల్లో భాగంగా అక్టోబర్‌లో అమెరికా సిలికాన్ వ్యాలీలో టీ హబ్ ఔట్‌పోస్టును ప్రారంభించనున్నాం. స్టార్టప్‌ల ప్రోత్సాహానికి అనువైన వాతావరణం, మద్దతు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా పేరొందిన వాణిజ్య సంస్థలు తమ ఉత్పత్తుల నాణ్యత పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. అందుకు అవసరమైన మానవ వనరులు రాష్ట్రంలో ఉన్నాయి. వచ్చే ఆగస్టు ఫెస్ట్ నాటికి వెంచర్ క్యాపిటలిస్టులు మరింత మందిని ఆహ్వానిస్తాం' అని కేటీఆర్ చెప్పారు. సమావేశంలో ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్‌రంజన్, ఆగస్ట్ ఫెస్ట్ నిర్వాహకుడు కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
టీమ్ వర్క్ తోనే విజయం.
1998లో ఆన్‌లైన్‌లో ఈ కామర్స్‌ను పనిచేయడం ప్రారంభించామని, మొదటి ఏడాది రోజుకు 50 ఆర్డర్లే వచ్చేవని, ప్రస్తుతం 2.5 మిలియన్ ఆర్టర్లు వస్తున్నాయని మార్ట్‌జాక్ సంస్థ సీఈఓ అభయ్ దేశ్‌పాండే చెప్పారు. సంస్థలో ఉద్యోగులు, అధికారులు ఒక జట్టుగా పనిచేయడంవల్లే ఇది సాధ్యమైందన్నారు. ప్రారంభ దశలో ఎన్నో ఇబ్బందులు పడ్డామని, తరువాత నేరుగా ప్రయాణికులతో అనుసంధానం చేసుకోవడంవల్ల పదేళ్ల కాలంలో దేశంలో అతిపెద్ద టికెట్ అమ్మకాల సంస్థగా మారిందని రెడ్‌బస్ వ్యవస్థాపకుడు ఫణీంద్ర సామ తెలిపారు. ఫెస్ట్‌లో వందకు పైగా స్టార్టప్ సంస్థల ఉత్పత్తులు ఆకట్టుకున్నాయి.

యాదాద్రి టెంపుల్ సిటీ లేఅవుట్లు, డిజైన్లను పరిశీలించిన సీఎం



యాదాద్రి దేవస్థానంపై సీఎం కేసీఆర్ సమీక్ష
భక్తుల రద్దీ భారీగా పెరిగే అవకాశం ఉంది
భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు
850 ఎకరాల విస్తీర్ణంలో టెంపుల్ సిటీ
వెళ్లేందుకు, వచ్చేందుకు రహదారులు నిర్మించాలి
గుట్టను ప్రకృతి రమణీయంగా తీర్చిదిద్దాలి
హైదరాబాద్ : నల్లగొండ జిల్లాలోని యాదాద్రి దేవస్థానం అభివృద్ధి పనులపై సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశానికి మంత్రి జగదీష్‌రెడ్డి, ఎంపీ బూర నర్సయ్యగౌడ్, వైటీడీఏ స్పెషల్ ఆఫీసర్ కిషన్‌రావుతో పాటు పలువురు అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా టెంపుల్ సిటీ లేఅవుట్లు, డిజైన్లను సీఎం పరిశీలించారు.
అనంతరం సీఎం మాట్లాడుతూ.. 'యాదాద్రిని అద్భుత పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతున్నందున రానున్న కాలంలో భక్తుల రద్దీ భారీగా పెరిగే అవకాశం ఉంది. భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలి. 850 ఎకరాల విస్తీర్ణంలో దేవాలయ నగరం ఏర్పాటు చేయాలి. కాటేజీలు, విశాలమైన రోడ్లు, పార్కింగ్, ఉద్యానవనాలు, పుట్‌పాత్‌లు, ఫుడ్‌కోర్టులు, ఇన్ఫర్మేషన్ కోర్టులు ఏర్పాటు చేయాలి. మొదటి దశలో 250 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టాల్సిన పనుల నమూనాలను ఖరారు చేశాం.
86 ఎకరాల విస్తీర్ణంలో 200 కాటేజీలు, మూడున్నర ఎకరాల విస్తీర్ణంలో ఫుడ్‌కోర్టులు, 7 ఎకరాల విస్తీర్ణంలో మంచినీరు, మరుగు నీటి నిర్వహణ వ్యవస్థ, 12 ఎకరాల్లో గ్రీనరీ, 62 ఎకరాల్లో రోడ్లు, 26 ఎకరాల్లో ల్యాండ్ స్కేపింగ్, 42 ఎకరాల గుట్ట ప్రాంతాన్ని ప్రకృతి రమణీయంగా తీర్చిదిద్దాలి. యాదాద్రిలో కాటేజీలు నిర్మించడానికి సింగరేణి, జెన్‌కోతో పాటు దేశ వ్యాప్తంగా కార్పొరేట్ కంపెనీలు ముందుకొస్తున్నాయి. కంపెనీలకు కేటాయించిన 1000-1500 గజాల ఓపెన్ ప్లాట్లను సిద్ధం చేయాలి. కాటేజీలు నిర్మించే ప్రాంతంలో రోడ్లు, విద్యుత్, మంచినీటి సౌకర్యం కల్పించాలి.
ప్రధాన ఆలయానికి వెళ్లేందుకు, వచ్చేందుకు రెండు వేర్వేరు రహదారులు నిర్మించాలి. ప్రస్తుతం ఉన్న దారిని గుట్టపైకి వెళ్లేందుకు, గుట్ట కిందకు వచ్చేందుకు కొత్త రహదారిని నిర్మించాలి. భక్తులను గుట్టపైకి తీసుకెళ్లేందుకు ప్రత్యేక రవాణా సదుపాయం కల్పించే యోచనలో ఉన్నాం. నిర్మాణాలు పూర్తయ్యాక నిర్వహణ బాధ్యతలు చూసేందుకు అవసరమైన వ్యూహం ఖరారు చేయాలి. యాదాద్రి పనులను నల్లగొండ జిల్లా ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు సమీక్షించాలి అని సీఎం ఆదేశించారు.

ఒబేసిటీ’ని ఓడిద్దాం



మీరు అధిక బరువు.. అదే ఒబేసిటీ సమస్యతో బాధపడుతున్నారా? ఆందోళన చెందకండి. ఆహారంలో కొద్దిపాటి మార్పులు చేసుకోవడం ద్వారా మీరు మీ శరీర బరువును తగ్గించుకోగలుగుతారు. కేవలం వారం రోజుల వ్యవధిలో మీరు 5 నుంచి 7 కేజీల వరకు బరువు తగ్గుతారు. ఒకవేళ మీరు ఇంకా ఎక్కువ బరువు తగ్గాలనుకుంటే, ఒక వారం రోజులు తర్వాత ఈ డైట్ ను మళ్ళీ మొదలుపెట్టవచ్చు. ఇలా మీరు మొత్తం బరువు తగ్గేవరకు కొనసాగించవచ్చు.
మొదటి రోజు
మీ డైట్ ప్లాన్ లో భాగంగా మొదటిరోజున కేవలం పండ్లు మాత్రమే తినాలి. అన్ని రకాల పండ్లు తినవచ్చు.. ఒక్క అరటిపండు తప్ప. అయితే ఎక్కువగా పుచ్చకాయ ముక్కలు తినడం వలన ఎక్కువ బరువు తగ్గుతారు. వీటితోపాటుగా రోజులో కనీసం 2 నుంచి 3 లీటర్ల మంచినీరు తాగాలి.
రెండో రోజు
ఈ రోజంతా కేవలం కూరగాయలే మీ ఆహారం. అన్ని రకాల కూరగాయలు తినవచ్చు. పచ్చివి తినగలిగితే తినండి, లేదంటే ఉడికించుకుని అయినా తినొచ్చు. అయితే బంగాళదుంప మాత్రం రోజులొ ఒక్కసారి మాత్రమే తినాలి. ఆది కూడా ఉదయం అల్పాహారం తీసుకునే సమయంలో మాత్రమే. 2 చిన్న బంగాళదుంపలు మాత్రమే ఉడకబెట్టుకుని తినాలి. అలాగే రోజులో కనీసం 2 నుంచి 3 లీటర్ల మంచినీరు తాగండి.

మూడో రోజు
ఇక మూడోరోజు మీరు అన్ని రకాల కూరగాయలు, పండ్లు తినవచ్చు. అయితే ఈ రోజంతా బంగాళదుంప మరియు అరటి పండు మాత్రం తినకూడదు. ఇవి తప్ప ఏవైనా తినొచ్చు. వీటితోపాటు 2 నుంచి 3 లీటర్ల మంచినీరు తాగాలి.
నాలుగో రోజు
ఈ రోజు 4 పెద్దవి లేక 6 చిన్న అరటి పండ్లు తినొచ్చు. వాటితొ పాటుగా 500 ml (అర లీటర్) పాలు కూడా తాగాలి. అంతేకాదు, ఈరోజు మొదలుకుని మీరు రోజుకి రెండుసార్లు క్యాబేజీ సూప్ తాగాలి
అయిదో రోజు

మీరు కనక శాకాహారులైతే.. ఈరోజు బ్రౌన్ రైస్ మరియు 6 టొమాటోలు తినవలసి ఉంటుంది. ఒకవేళ మీకు బ్రౌన్ రైస్ దొరక్కపోతే, దానిబదులు పనీర్ తినొచ్చు. ఇక రోజు మధ్యలో ఆకలి వేసినపుడు క్యాబేజీ సూప్ తాగాలి. ఒకవేళ మీరు మాంసాహారులయితే అర కేజి బోన్ లెస్ చికెన్ లేదా మేక మాంసం లేదా చేపను తినాలి. దీంతోపాటు 6 టొమాటోలు తినాలి. అంతగా ఆకలి వేస్తే క్యాబేజీ సూప్ ఉండనే ఉందిగా.. ఈ సూప్ ఎంతైనా తాగొచ్చు.
ఆరో రోజు 

ఆరో రోజున శాకాహారులు బ్రౌన్ రైస్ మరియు కూరగాయలు తినొచ్చు. టొమాటోలుగాని బంగాళదుంపగాని తినకూడదు. ఆకలి వేసినప్పుడు క్యాబేజీ సూప్ తాగుతూ ఉండాలి. మాంసాహారులయితే.. అర కేజి బోన్ లెస్ చికెన్ లేదా మేక మాంసం లేదా చేపను తినాలి. కుదిరితే చికెన్ సూప్ చేసుకుని తాగొచ్చు. కూరగాయలుతో చేసిన సలాడ్ మాత్రం తప్పనిసరిగా తినాలి. మరీ ఆకలి వేస్తే క్యాబేజీ సూప్ తాగొచ్చు.
ఏడో రోజు
ఈరోజు మీరు బ్రౌన్ రైస్ తప్పనిసరిగా తినాల్సి ఉంటుంది. మొలకెత్తిన పెసలు మరియు నచ్చిన కూరగాయలు బ్రౌన్ రైస్ లో వేసుకుని వెజ్ బిర్యానీలా చేసుకుని తినాలి. దీంతోపాటు మీకు ఇష్టమైన పండ్ల రసాలు తాగండి. ఆకలి వేసినపుడు క్యాబేజీ సూప్ తాగాలి.
ఇవి గుర్తుంచుకోండి..
ఈ వారం రోజులు రోజుకి కనీసం 2 నుంచి 3 లీటర్ల మంచినీరు తాగాలి. మద్యపానం జోలికి పోకూడదు. అలాగే చిరుతిండ్లు మరియు నూనె అధికంగా ఉన్న ఆహార పదార్థాలు తినకూడదు. కుదిరితే రోజుకి కనీసం ఒక అరగంట వ్యాయామం చేయాలి. రోజూ క్యాబేజీ సూప్ మాత్రం తప్పకుండా తాగాలి.
మీరు కనుక ఏడు రోజులు క్రమం తప్పకుండా ఈ రకమైన ఆహారం తీసుకుంటే కనీసం 5 నుంచి 7 కేజీల బరువు తగ్గుతారు. ఒకవేళ ఇంకా బరువు తగ్గాలనుకుంటే ఈ డైట్ ను మళ్ళీ మొదలెట్టండి.. 

Paytm Will Invests INR 300 Cr on its Travel Business -PAYTM



Paytm, India’s largest mobile payment and commerce platform, has registered over 1 million flight and bus ticket bookings on its Travel Marketplace in August. The company expects 2x growth in the travel business over the next 6 months.
Paytm’s bus tickets business recently turned break-even. The Hotels category is expected to turn break even very soon and the Flights bookings has been organically scaling at a 4x month-on-month growth since its launch in May. In its drive towards creating the country’s best cashless travel ecosystem, Paytm will soon launch new categories and ancillaries. To fuel this growth, the company will further invest INR 300Cr on its travel business.
Being modeled as a marketplace, Paytm has multiple sellers providing various travel services to customers. This allows the platform to offer a diverse selection at the most competitive prices. Paytm offers a unique opportunity for travel service providers to gain access to its 130 million strong and growing user base.
Abhishek Rajan, Vice President, Paytm, said, “At Paytm, we are building India’s largest travel marketplace with the mission to solve every need of a traveller – be it transport, accommodation, activities or ancillaries. We have seen exponential growth in all categories and will soon offer new services to our customers. Leveraging Paytm’s significant market penetration and strong brand proposition, we hope to grow India’s online travel booking pie by introducing new customers from tier II, III towns and cities to this category.
The company has set up a 100+ member team in its Bengaluru office to drive innovation in the category. This move is an important step in the vision of making cashless transactions a way of life across all consumer segments and demographic profiles in India.

Wednesday 31 August 2016

Hayath Nagar Division Corporator In Rain


Hayath Nagar Division Corporator Sama Tirumal Reddy Garu Solving the Water Struck problems caused due to Rain in Hayath Nagar Bus Depot..

TRS 137 Division Corporator Baddam Parshuram Reddy Garu Checking and Solving problems



TRS 137 Division Corporator Baddam Parshuram Reddy Garu inspecting and Solving problems of people caused due to rain in the Division..
Salute to Mass Leader 

Avoid Tank Bund Route Due to Rain




Avoid Tank Bund Route Due to Rain
Use Alternative routes and be careful while driving