Saturday 10 September 2016

కేవీపీ పట్టువీడని విక్రమార్కుడు: వెంకయ్య నాయుడు


న్యూ ఢిల్లీ: కాంగ్రెస్ నేత కేవీపీ పట్టువీడని విక్రమార్కుడని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ప్రశంసలు కురిపించారు. ఇవాళ హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇప్పుడు హోదా, ప్యాకేజీ కావాలని ఆరాట పోరాటం చేస్తున్న యోధులందరూ అప్పుడు ఎక్కడున్నారో ఒకసారి చెబితే బాగుంటుంది.. అప్పుడు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ప్రత్యేక ఆంధ్రప్రదేశ్, ప్రత్యేక తెలంగాణ వద్దని ఎవరూ పోరాడలేదు.. అలా పోరాడిన ఏకైక వ్యక్తల్లా కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావు అంటూ వెంకయ్య చెప్పుకొచ్చారు. ఆయన పట్టువదలని విక్రమార్కుడని ఆయన ప్రశంసించారు. కేవీపీ తప్ప మిగతా వారంతా ఆనాడే సర్దేశారని వెంకయ్య తెలిపారు. కాగా పవన్ తిరుపతి, కాకినాడ సభలో బీజేపీ చేసిన విమర్శలు తిప్పికొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయ్.!

No comments:

Post a Comment